హైదరాబాద్ : తెలంగాణలో పూర్తి స్థాయి లాక్డౌన్ ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. లాక్డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. ఢిల్లీలో లాక్డౌన్ కారణంగానే రాష్ర్టానికి టెస్టింగ్ కిట్లు రావడం లేదని పేర్కొన్నారు. లాక్డౌన్ కంటే మంచి చికిత్సను అందించడం ముఖ్యమని ఆయన చెప్పారు. రాష్ర్టంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. లాక్డౌన్ వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది. ఆ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక అవసరాలు, అక్కడి పరిస్థితులను బట్టి పొరుగు రాష్ర్టాలు లాక్డౌన్ పెట్టుకున్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..