వరంగల్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం హన్మకొండలోని ఆయన నివాసంలో వినోద్ కుమార్తో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు భేటీ అయ్యారు.
నూతనంగా వీసీలుగా నియమితులైన సందర్భంగా వారు మర్యాద పూర్వకంగా వినోద్ కుమార్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలలో 1,050 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కోర్టు కేసుల వల్ల కొంత సమయం పడుతుందని, ఈ అంశం త్వరలోనే తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం