దుబాయ్: ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కంటే న్యూజిలాండ్కు మొగ్గు ఎక్కువని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఇంగ్లండ్లో పరిస్థితులు కివీస్కు అనుకూలంగా ఉండటంతో పాటు స్వింగ్ బౌలింగ్కు సహకరించడం వారికి కలిసి రానుందని లీ పేర్కొన్నాడు. ఈనెల 18 నుంచి భారత్, కివీస్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొదలవుతున్న నేపథ్యంలో లీ శుక్రవారం ఐసీసీ అధికారిక వెబ్సైట్తో మాట్లాడాడు. ‘సమవుజ్జీల్లాంటి ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశముంది. స్వదేశంలో లాంటి పరిస్థితులు ఇంగ్లండ్లో ఉండటం కివీస్కు కలిసొచ్చే అంశం. విలియమ్సన్ది శాంత స్వభావమయితే..కోహ్లీది దుందుడుకు నైజం’ అని లీ అన్నాడు.