నిజామాబాద్ : బియ్యాన్ని తరలిస్తున్న టాటా ఏస్ వాహనం బోల్తాపడటంతో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న గుట్టు రట్టుయింది. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల జిల్లాలో ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్ర కు తరలిస్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద అక్రమ బియ్యంతో కూడిన వాహనం బోల్తా పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలికి పోలీసులు వచ్చి వివరాలు సేకరించగా అవాక్కయ్యే విషయం బయట పడింది. బియ్యంలోడుతో ఉన్న వాహనంలో ప్రభుత్వం పంపిణీ చేసిన పీడీఎస్ బియ్యాంగా గుర్తించారు. చౌకగా జగిత్యాల జిల్లాలో సేకరించిన బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తుండగా ప్రమాదం జరగడంతో గుట్టు రట్టు అయ్యింది. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు వాహనాన్ని సీజ్ చేశారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Heavy rains | భారీ వర్షాలతో తడిసి ముద్దయిన తెలంగాణ
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్