సూర్యాపేట : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రామాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాల మున్సిపల్ చైర్మన్ లకు పిలుపునిచ్చారు. పట్టణ, పల్లె ప్రగతిలపై ప్రత్యేక కార్యాచరణ పథకాలను రూపొందించినప్పటికి ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. కార్యక్రమంలో ఎదురౌతున్న లోటుపాట్లను సరిదిద్దుకుని విజయవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
జులై 1 నుంచి 10 వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతిపై మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణప్రగతిపై సత్ఫాలితాలు సాదించేందుకు గాను సీఎం సూచనలు పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో సమీకృత వెజ్,నాన్ వెజ్ కూరగాయల మార్కెట్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన చెప్పారు. వైకుంఠధామాల నిర్మాణాలలో ఎంతమాత్రం అలసత్వం చూపొద్దన్నారు. మున్సిపాలిటీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. భూముల రికార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలన్నారు. పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటులో మున్సిపాలిటీలు ముందుండలన్నారు. ఇండ్ల మీదుగా వెడుతున్న విద్యుత్ తీగల తొలగింపుపై నివేదికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నారు.
అంతే గాకుండా పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు టి. వినయ్ కృష్ణా రెడ్డి, యాదద్రి కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు యస్. మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్, దీపక్ తివారీ, రాజీవ్ శర్మ , మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి
హరితహారంతో ములుగుకు పూర్వవైభవం రావాలి