హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : కల్లు కంపౌండ్లలో అక్రమంగా కలుపడానికి అల్ఫ్రాజోలమ్ను సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ పట్టుకున్నది. హైదరాబాద్లోని మాచబొల్లారం రుక్మిణి ఎన్క్లేవ్ వద్ద చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు 25 లక్షల విలువైన 1.189 కిలోల అల్ఫ్రాజోలమ్, రూ.5,45,100 నగదు, 8 మొబైల్ ఫోన్లు, మారుతి బ్రెజా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్లులో మత్తును పెంచి, వినియోగదారులను బానిసలుగా మార్చడం ద్వారా ఎకువ లాభాలు గడించవచ్చనే దురాశతో అక్రమ రవాణాకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో సంగారెడ్డికి చెందిన ప్రభాకర్ గౌడ్ (28), బైక్స్ రికవరీ ఏజెంట్ మనోజ్ గౌడ్ (38), కల్లు వ్యాపారి సతీశ్ గౌడ్ (46), రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ గౌడ్ (60), కల్లు వ్యాపారి సీహెచ్ వెంకటేశ్ గౌడ్ (58), కల్లు కంపౌండ్ వర్కర్ ప్రశాంత్ గౌడ్ (40) ఉన్నారు. పరారీలో కుప్పుల నరేందర్ గౌడ్ (నాగోల్), అంతటి విజయ్ కుమార్ (గోల్నాక), విశాల్ గౌడ్ (గుమ్మడిదల) ఉన్నట్టు ఈగల్ అధికారులు తెలిపారు.