రాజన్న సిరిసిల్ల : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులను ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర మంత్రి కారుతో గుద్ది చంపారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.
బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని అక్రమంగా నిర్భందించడాన్ నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
లఖింపుర్ ఖేరి ఘటనపై మంత్రి కేటీఆర్ షాక్
Crime news |ఐలాపూర్ చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
విహారంలో విషాదం..నీటిలో మునిగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి