కామారెడ్డి : జిల్లాలో విషాదంద చోటు చేసుకుంది. లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామ ఊర చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు ఐలాపూర్ గ్రామానికి చెందిన హనీఫ్(36), లింగంపేట్ చెందిన శ్రావణ్(22) గా గుర్తించారు. స్థానికుల కథనం మేరకు.. సరదాగా గడిపేందుకు ఇద్దరు యువకులు చెరువు వద్దకు వెళ్లారు.
శ్రావణ్ మొదట చెరువులో లోకి దిగి ప్రమాదవశాత్తు మునిగి పోతుండడంతో తన స్నేహితుడిని కాపాడేందుకు హనీఫ్ నీళ్లలోకి దిగి రక్షించే క్రమంలో శ్రావణ్తో పాటు అతడు మునిగిపోయి మృతి చెందారు. ఇరువురి మృతదేహాలు చెరువు తూములో ఇరుక్కు పోవడంతో స్థానికులు వల సహాయంతో బయటకు తీశారు. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.