పెద్దపల్లి : జీవితాంతం తోడు నీడగా ఉంటామని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భర్త వెంటే పయనించింది ఆ ఇల్లాలు. చావులోను వారి బంధం విడిపోలేదు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య గుండె ఆగిపోయింది. ఇరువురు ఒకేరోజు మరణించడంతో కుటుంబ సభ్యులు దుఖః సాగరంలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన లింగయ్య (65) తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా, తన భర్త మరణ వార్త విని భార్య రాజమ్మ (60) గుండెపోటుతో మృతి చెందింది. భార్య భర్తలు ఇద్దరు ఒకేరోజు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
లఖింపుర్ ఖేరి ఘటనపై మంత్రి కేటీఆర్ షాక్
Crime news |ఐలాపూర్ చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
విహారంలో విషాదం..నీటిలో మునిగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి