తుంగతుర్తి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన రామన్నగూడెం బీజేపీ పార్టీ ఎంపీటీసీ ఆంబోతు నరేష్, దత్తప్పగూడెం కాంగ్రెస్ ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి గురువారం మంత్రి జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు.
వారికి గులాబీ కండుకాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీచైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jai Bhim: తగ్గని జై భీమ్ హవా.. టాప్లో నిలిచిన సూర్య లేటెస్ట్ చిత్రం
Brutally murdered | పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Singareni | బొగ్గు గనుల అమ్మకాలపై భగ్గుమన్న సింగరేణి కార్మికులు