పెద్దపల్లి : జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దండగులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిచంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులోని ఇటుక బట్టీల సమీపంలో పంక్చర్ కొట్టు నడుపుకునే వ్యక్తి హత్యకు గురయ్యాడు. హతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ముఖేష్గా గుర్తించారు.
స్థానికుల సమాచారంతోపెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Jai Bhim: తగ్గని జై భీమ్ హవా.. టాప్లో నిలిచిన సూర్య లేటెస్ట్ చిత్రం
చిరుతను చంపిన ముగ్గురి అరెస్టు
బస్సు కిందకు దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి