మన్ననూర్, డిసెంబర్ 8: చిరుతను హతమార్చి, దహనం చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు నాగర్కర్నూల్ డీఎఫ్వో కృష్ణాగౌడ్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో మల్లెలతీర్థం సమీపంలోగల కుడిచింతల బావి గ్రామంలోని కృష్ణయ్య వ్యవసాయ పొలంలో గతనెల 20న అటవీ జంతువుల వేటకు ఉచ్చులు వేశారు. ఆ ఉచ్చుకు చిరుత చిక్కడంతో హతమార్చి 18 గోర్లను, 4 దంతాలను సేకరించారు. ఆ తరువాత దాన్ని దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కుడిచింతల బావి గ్రామానికి చెందిన కృష్ణయ్య, లాలు, వెంకటేశ్ను అదుపులోకి తీసుకున్నట్టు డీఎఫ్వో కృష్ణాగౌడ్ తెలిపారు.