జనగామ : జనగామ(Jangaon) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమయాదం(Road accident) చోటు చేసుకుంది. కొడకండ్ల మండలం గిర్ని తండా వద్ద హైవేపై డీసీఎం-తుఫాన్ వాహనం ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగిరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులు సూర్యాపేట జిల్లా ఈటూరు వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..