KTR | హైదరాబాద్ : బంజారాహిల్స్లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్కు బీఆర్ నాయుడు వేంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. బీఆర్ నాయుడికి శాలువా కప్పి వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు.
తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ చైర్మన్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే కరీంనగర్లో, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని కోరారు.
కేటీఆర్ చేసిన విజ్ఞప్తుల పట్ల బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. టీటీడీ తరఫున తెలంగాణ భక్తుల దర్శనాల విషయంలో, అలాగే ఆలయాల నిర్మాణం, అభివృద్ధి విషయంలో తప్పకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు..! హిమాచల్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ట్వీట్
Group-1 | గ్రూప్-1 పిటిషన్లపై విచారణ నవంబర్ 26కు వాయిదా