KTR | హైదరాబాద్ : గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి రాష్ర్టాన్ని దివాలా తీయించిన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారుకు మరో భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
గద్దెనెక్కడం కోసం అడ్డగోలుగా గ్యారెంటీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. చేతికందినన్ని అప్పులు చేయడం.. ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చేయించుకునే పరిస్థితికి రావడం దారుణమన్నారు. ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు.. సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
గ్యారెంటీలు అమలు చేయలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి మొన్న! మీరు చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, ఢిల్లీలో మీ హిమాచల్ భవన్ను జప్తు చేస్తాం అని హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. ఎంత సిగ్గుచేటు? అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను నడపడానికి బదులుగా సర్కస్లను నడుపుతుందన్నారు. మరి తెలంగాణలో మీరు ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మీరు ఏం విక్రయిస్తారని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.
గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం!
చేతికందినన్ని అప్పులు చెయ్యడం!
ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం!ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు! సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు!
గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థి… pic.twitter.com/1lfvoR1Bu7
— KTR (@KTRBRS) November 20, 2024
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 పిటిషన్లపై విచారణ నవంబర్ 26కు వాయిదా