ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్ షెడ్యూల్ విడుదలైంది. కౌన్సెలింగ్కు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇవాళ ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 6 నుంచి 12 వరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించింది. ఈనెల 8 నుంచి 12 వరకు పరిశీలన ఉంటుందని వెల్లడించింది. 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయిస్తామని మండలి ప్రకటించింది. ఈ నెల 22 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపింది.
22న స్లాట్ బుకింగ్, 23న ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. 26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు తర్వాత 28న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వివరించింది.
తాజావార్తలు
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్గా చిత్రించారు