అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల (General election) నామినేషన్ల గడువు ముగిసింది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియంలో భాగంగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా గురువారం నామినేషన్ల (Nominations) ఘట్టం ముగిసింది. వీటిలో 175 అసెంబ్లీ స్థానాలకు 4, 210 నామినేషన్లు దాఖలు కాగా 25 పార్లమెంట్ స్థానాలకు 731 మంది నామినేషన్లు వేశారు.
రేపటి నుంచి మూడురోజుల పాటు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, మే 13 న ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందుల (Pulivendula) లో నామినేషన్ వేయగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం (Kuppam) లో, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్లు వేశారు.