Pathankot | పఠాన్కోట్లోని ఆర్మీ స్టేషన్ సమీపంలోని కాలువ ఒడ్డున గురువారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్ధం సుమారు రెండు కిలోమీటర్ల మేర వినపడడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే నగర డీఎస్పీ సుమర్ సింగ్ మాన్ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులకు కొన్ని ముక్కలు సైతం లభించాయి. పేలుడు జరిగిన ప్రదేశం ఆర్మీ స్టేషన్కు 30 మీటర్ల దూరంలో ఉంది. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. పేలుడు శబ్ధం బాంబులు పేలినట్లుగా వచ్చిందని పరిసర ప్రాంతాల వ్యక్తులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.