వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్, రహానె, విరాట్ కోహ్లీ, పుజారా, ఇషాంత్ శర్మ, బుమ్రా, రిషబ్ పంత్ తదితరులు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజాగా టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా శుక్రవారం కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్నాడు. జడేజా, అతని భార్య రివాబా రాజ్కోట్లో టీకా వేసుకున్నారు. గాయంతో స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్కు దూరమైన జడేజా తిరిగి భారత జాతీయ జట్టులోకి వచ్చాడు. జూన్ 18 నుంచి సౌతాంప్టన్లో న్యూజిలాండ్తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ తలపడనుంది. ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో సిరీస్కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.