హైదరాబాద్ : మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణధారం అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎంపీ సంతోష్ కుమార్ను ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి.. సద్గురు ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
త్వరలోనే హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈశా ఫౌండేషన్ నిర్వహించే సేవ్ సాయిల్ ఉద్యమ కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ను ఆహ్వానించారు. సేవ్ సాయిల్ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలో నిర్వహించే కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించామని తెలిపారు. ఈ ఉద్యమం నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి, అనుకున్న లక్ష్యాన్ని చేరిందని ఈశా ఫౌండేషన్ సభ్యులకు వివరించారు. మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణాధారమనీ, మట్టికి – మొక్కకు అవినాభావ సంబంధం ఉందన్నారు. అందుకే మట్టిని కాపాడుకుందాం – మొక్కను బతికించుకుందాం అని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
Honoured to have our #GreenIndiaChallenge got noticed by @SadhguruJV ji and elated to got invitation from him to be part of #SaveSoil movement. It’s in deed would be helpful for the #MotherNature if we restore the Soil at least part of what it has got lost due to various reasons. pic.twitter.com/cxTeko1HAo
— Santosh Kumar J (@MPsantoshtrs) April 19, 2022