వనపర్తి : గిరిజనుల అభివృద్ధి సీంఎం కేసీఆర్తోనే సాధ్యమని మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు. ఖిలా ఘనాపూర్ మండలం కర్నె తండాలో తుల్జాభవాని ఆలయాన్ని మంత్రులు ప్రారంభిచారు. ఈ సదర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ..కర్నెతండా తుల్జాభవానీ ఆలయం తెలంగాణ తుల్జాభవానీ ఆలయంగా విలసిల్లాలని ఆకాక్షించారు.
రూ.72 కోట్లతో కర్నెతండా లిఫ్టు సాధించామన్నారు. ప్రభుత్వ దవాఖానను తీసుకువస్తానని హామీనిచ్చారు. కర్నెతండా లిఫ్టుకు సీఎంతో శంకుస్థాపన చేయిస్తామన్నారు. మండలంలోని 24 తండాలకు 20 తండాలకు రహదారులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. కర్నెతండా లిఫ్టుతో సాగునీటి సమస్య తీరిపోతుందన్నారు. దేవాలయం నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..తుల్జాభవాని మాత ఆలయం నిర్మించుకోవడం గొప్ప విషయం అన్నారు. సీఎం కేసీఆర్తోనే గిరజనుల అభివృద్ధి సాధ్యమన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసి మన తండాలను మనం పాలించుకునే అవకాశం కల్పించారని ప్రశంసించారు. సాగునీటి రాకతో గిరిజనుల జీవితాలలో మార్పు వచ్చిందన్నారు. వలసలు ఆగిపోయాయన్నారు.
ఘణపురం అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృష్ణానాయక్, జడ్పీటీసీ సామ్యానాయక్, సర్పంచ్ శాంతాబాయి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news |మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబా అరెస్ట్
T20 World Cup | దుబాయ్లో కలిసిన ధోనీ, గేల్.. ఫొటో వైరల్
Singur project | సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద