కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆదివాసీ హక్కుల సాధన కోసం కుమ్రం భీమ్ చేసిన పోరాటం చారిత్రాత్మకమని ట్రెయినీ ఐఏఎస్ అధికారుల బృందం పేర్కొన్నది. శనివారం కెరమెరి మండలంలోని జోడేఘాట్ గ్రామాని సందర్శించి కుమ్రం భీమ్కు నివాళ్లు అర్పించారు. కుమ్రం భీమ్ స్మృతి చిహ్నం, మ్యూజియాన్ని సందర్శించి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా భీమ్ పోరాట చరిత్ర తెలుసుకున్న అనంతరం ఆయన చేసిన సాహసోపేత పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
పోరాట వీరుని ఖ్యాతి అందరికీ ఆదర్శంగా నిలిచేలా జోడేఘాట్లో భీమ్ స్మృతి చిహ్ననానని ప్రభుత్వం ఆకర్షణీయంగా తీర్చిదిద్దిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు కర్ణటి వరుణ్ రెడ్డి, చిత్ర మిశ్రా, పాటిల్ హేమంత్ కేశవ్, గరిమా అగ్రవాల్, దీపక్ తివారీ, ప్రతిమా సింగ్, అంకిత్, రిజ్వాన భాషా షేక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..