Vande Bharat Express | హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. అయితే తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ద.మ. రైల్వే అధికారులు ట్వీట్ చేశారు.
సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్(రైలు నంబర్ 20702).. రాత్రి 8.15 గంటలకు బయల్దేరనున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగానే తిరుపతి – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. రద్దయినవాటిలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, సోమవారం ఉదయం 96 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.
Rescheduling of Train
Train No. 20702 Tirupati – Secunderabad Vande Bharat Express scheduled to depart Tirupati at 15.15 hrs today i.e., 02.09.2024 is rescheduled to depart at 20.15 hrs on the same day….due to late running of its pairing train.
— South Central Railway (@SCRailwayIndia) September 2, 2024
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణకు కష్టమొచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్సే.. కేటీఆర్ ట్వీట్
SCR | 432 రైళ్లు రద్దు.. 140 రైళ్ల దారి మళ్లింపు..
Rains | హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. అత్యధికంగా గచ్చిబౌలిలో 97 మి.మీ. వర్షపాతం నమోదు