సిద్దిపేట : గ్రామాల అభివృద్ధి సంపూర్ణ బాధ్యత మీదేనని, గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ అధికారులతో కలిసి సమన్వయంతో పూర్తి చేయించాలని ఆయా గ్రామ సర్పంచ్లకు మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో గురువారం సిద్దిపేట రూరల్ మండలంలోని ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘంగా మంత్రి సమీక్షించారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్పంచ్లంతా టీమ్ లీడర్గా వ్యవహరించి అసంపూర్తి పనులపై అధికారులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో చర్చించాలన్నారు. పలు గ్రామాల్లో చేపడుత్ను పనులపై అధికారులకు కనీస పర్యవేక్షణ కొరవడిందన్నారు. పనితీరు మార్చుకోవాలని, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను మంత్రి సుతిమెత్తగా ఆదేశించారు.
మిషన్ భగీరథ తాగునీరు, విద్యుత్, వైకుంఠ ధామాలు, సెగ్రీ గేషన్ షెడ్- డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనం, కొత్త పంచాయతీ భవనాలు, గ్రామాల్లోని పలు కుల సంఘ భవనాల నిర్మాణాల ప్రగతి పనులన్నీ త్వరితగతిన చేపట్టాలని ఆయా శాఖాధికారులను మంత్రి ఆదేశించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ, డీపీఓ పార్థసారథి, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస చారి, డీఈ నాగభూషణం, పంచాయతీ రాజ్ శాఖ ఏఈ చారి, ఏంపీడీఓ సమ్మిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!