ఖమ్మం : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2 వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సుడా చైర్మన్ విజయ్, డీఎఫ్వో ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి