యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ నెల 17న ప్రారంభమైన పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. చివరి రోజైన గురువారం పవిత్రముల ధారణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలను అర్చకులు శాస్త్రోత్తంగా ముగించారు.
తెలిసీ తెలియక ఏడాది నుంచి చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య వేదపండితుల వేదపారాయణాల నడుమ మహాపూర్ణాహుతితో అర్చకులు పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి!
విషాదం : కాన్పుకోసం వచ్చి మహిళ మృతి
తెలంగాణ ఉద్యమంలో ఫొటో గ్రాఫర్స్ పాత్ర మరువలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్