Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం( BJP Govt )పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) మరోసారి మండిపడ్డారు. ఉప్పల్ ఫ్లై ఓవర్( Uppal Flyover ) పనులపై ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. కేటీఆర్కు ట్యాగ్ చేయగా, ఆయన కూడా ట్విట్టర్ వేదికగానే స్పందించారు. రహదారుల అభివృద్ధి విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి( KCR Govt ), మోదీ ప్రభుత్వానికి( Modi Govt ) ఉన్న తేడా ఇదేనంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణలో కొనసాగుతున్న రహదారుల అభివృద్ధిపై కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఉప్పల్, అంబర్పేట ఫ్లై ఓవర్ల( Amberpet Flyover ) పనులు దురదృష్టావశాత్తు నేషనల్ హైవేస్( National Highways ) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ రెండు ఫ్లై ఓవర్లకు జీహెచ్ఎంసీ( GHMC ) భూములు కేటాయించినప్పటికీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీ ద్వారా ఎస్ఆర్డీపీ( SRDP ) కింద 35 ప్రాజెక్టులు చేపట్టి.. అనతి కాలంలోనే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. కానీ కేంద్రం చేపట్టిన రెండు పనులు మాత్రం పూర్తి కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని కేటీఆర్ పేర్కొన్నారు.
ఉప్పల్ ఫ్లై ఓవర్ ఎప్పుడు పూర్తవుతుంది సర్.. పనులు చాలా మెల్లగా కొనసాగుతున్నాయి. నారపల్లి నుంచి సిటీలోకి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెటిజన్.. కేటీఆర్కు ట్యాగ్ చేశారు.
Uppal and Amberpet flyovers are unfortunately being executed by National Highways. Both progressing at snails pace even though GHMC has completed the land acquisition as committed
While we have completed 35 projects they are unable to complete even 2 !!
That’s the Difference… https://t.co/LENfADiqgK
— KTR (@KTRBRS) March 26, 2023