మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రం గొర్రెల సంపదలో మొదటి స్థానంలో ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కులవృత్తులకు గుర్తింపు వచ్చిందన్నారు. గురువారం జిల్లాలోని తిమ్మసానిపల్లి గ్రామంలో రూ.62.50 లక్షల విలువ చేసే 50 యూనిట్ల గొర్రెలను యాదవులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు ఉచితంగా గొర్రెలు పంపిణీ చేయలేదని, కానీ తమ ప్రభుత్వం మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తున్నదన్నారు.
కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మహబూబ్నగర్ జిల్లాలోనే రూ.315 కోట్ల విలువైన 5 లక్షల 27 వేల 835 గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిపోయిన వారికి కూడా పంపిణీ చేసేందుకు తిమ్మసానిపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో యాదవుల జాబితాను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
అదేవిధంగా త్వరలో ఎస్సీ కులవృత్తులకు వెయ్యికోట్ల రూపాయలతో పథకాలు రాబోతున్నాయని వెల్లడించారు. అలాగే జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రూ.45 లక్షల 43,268 విలువ గల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్నమ్ రాజేశ్వర్గౌడ్, పశుసంవర్ధశాఖ జేడీ మధుసూదన్గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..