యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రానికి మకుటాయమానంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి పునర్నిర్మాణ కట్టడాలను పరిశీలించారు. రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల లోని భక్తుల కోసం యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా పునః నిర్మిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషితో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునః నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఉండే విధంగా చూడాలని స్వామిని ప్రార్థించానని ఆయన తెలిపారు. అంతకు ముందు ఆలయ అధికారులు, పురోహితులు మంత్రి దయాకర్ రావుకు స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి..
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే