జనగామ : పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డయోగ్నస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ రాజయ్య తో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి రక్త పరీక్ష చేయించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకు రావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
కరోనా వంటి వ్యాధుల నేపథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని అయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డయాగ్నోస్టిక్ కేంద్రాలలో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరు వీటిని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం