జనగామ : దేశంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నది కూడా తెలంగాణలోనే అని స్పష్టం చేశారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి పథకం నిరుపేదలకు వరం అన్నారు. దళిత బంధు దళితుల కోసం చేపట్టిన అద్భుత పథకమని మంత్రి చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా సీఎం పని చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక విధానాలతో రైతులను ఆగం చేస్తున్నదని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
Kumrambhim Asifabad | అడా ఎస్బీఐ బ్యాంక్లో భారీ చోరీ
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
Mulugu | రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్