Rythu Bandhu | రైత బంధు (Rythu Bandhu) స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జరిగే నగదు బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీ (BRS Paty) కోరింది. ఈ మేరకు సోమవారం లేఖ రాసింది.
యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పంపిణీకి ఈసీ ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే అనూహ్యంగా నేడు ఆ అనుమతుల్ని ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఈసీని ఆశ్రయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అనుమతిని నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.
ఈ విషయంలో విపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేశాయని పేర్కొంది. మంత్రి హరీశ్ రావు ఈ పథకాన్ని ప్రచారం చేయలేదని.. అనుమతి మంజూరు చేసినందుకు ఈసీకి కృతజ్ఞతలు మాత్రమే తెలిపారని వివరించింది. దీన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించలేమని బీఆర్ఎస్ పార్టీ తన లేఖలో పేర్కొంది.
Also Read..
Minister Harish Rao | రైతుబంధు కావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలి: మంత్రి హరీశ్ రావు
Minister KTR | కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు తీసేస్తారు: మంత్రి కేటీఆర్