హుజూరాబాద్ : ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైన టీడీపీ.. అక్కడక్కడ ఉన్న కొద్ది మంది లీడర్లు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. హుజూరాబాద్లో వివిధ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై గులాబీ గూటికి చేరుతున్నారు.
తాజాగా తెలుగుదేశం కరీంనగర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ముచ్చ సమ్మిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమ్మిరెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సమ్మిరెడ్డి గతంలో దమ్మక్కపేట ఎంపీటీసీగా సేవలందించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తానని సమ్మిరెడ్డి స్పష్టం చేశారు.