మెదక్, మే 5 : జిల్లాలో శరవేగంగా వ్యాపిస్తు న్న కరోనా కట్టడికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా అని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం దవాఖానలకు తరలించేందుకు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా కిట్లు అందజేయడానికి, వైద్య సేవలను పర్యవేక్షించడానికి ప్రతి డివిజన్కు ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు తెలి పారు. మెదక్ డివిజన్కు ఆర్డీవో సాయిరాం, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, నర్సాపూర్ డివిజన్కు రవీందర్రెడ్డిని ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించారు. ఆయా మండలాల పరిధిలో కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకోవడంతో పాటు బృందాలు ఇంటింటికీ వెళ్లి కరో నా బాధితులను గుర్తించి కరోనా కిట్లు అందించడానికి అధికారులు కృషి చేయాలన్నారు. కరోనా లక్షణాలతో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించడానికి, దవాఖానలకు తరలించడానికి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ హరీశ్ కోరారు.