సిద్దిపేట : లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ హెచ్చరించారు. లాక్డౌన్ సందర్భంగా సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్డు హై స్కూల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు.
లాక్ డౌన్ సమయములో అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంఇడి బయటకు రావొద్దన్నారు. సరైన కారణం లేకుండా ఎవరైనా తమ వాహనాలపై బయట తిరుగుతూ పట్టుబడితే వారి వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. తమ పిల్లలు బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రులపై ఉందన్నారు.
చికెన్, మటన్ షాపుల ముందు ప్రజలు సామాజిక దూరాన్ని మరిచి పోయి గుంపులుగా గుమి గూడి ఉంటున్నారు. దీని వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలు పాటించి, క్రమశిక్షణతో ఉన్నప్పుడు మాత్రమే మనం మన ప్రాణాలను, మన కుటుంబాలను కాపాడుకోవడం సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు, కొవిడ్ నిబంధనలు పాటించాలని కమిషనర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లంక టూర్లో టీమిండియా కోచ్గా ద్రవిడ్