నిజామాబాద్ : ఎస్సారెస్పీ నీటి మట్టం 72 టీఎంసీలకు చేరిందని మంగళవారం ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,407 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని పేర్కొన్నారు. వానకాల పంటలకు గాను కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, గుత్ప, ఎత్తి పోతలకు 630 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1086.60 అడుగులకు (72 టీఎంసీలు) చేరిందన్నారు. ఈ సీజనులో ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం 57 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ఏఈఈ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన