ములుగు : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో వెలిసిన మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం వెంకటాపు రం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు వెళ్లే ప్రధాన రహదారిలోని బోదాపురం గ్రామ సమీపం వద్ద మావోయిస్టుల కరపత్రాలు కనిపించాయి. భారత కమ్యునిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఉన్న కరపత్రాల్లో జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఉంది.
ఇవి కూడా చదవండి..
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన