Pancharamalu | కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 15 : కార్తీకమాసాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం కోసం పంచారామలకు కొత్తగూడెం డిపో నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ యూ. రాజ్యలక్ష్మీ బుధవారం తెలిపారు. కొత్తగూడెం నుండి పంచారామాలైనా అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్ లగ్జరీ బస్సు ఆపరేట్ చేస్తున్నట్టు భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 26 రాత్రి 8 గంటలకు పాల్వంచ నుండి కొత్తగూడెంకు బస్సులు బయల్దేరుతాయని పంచారామాలకు పెద్దలకు రూ.2050, పిల్లలకు రూ.1050 నిర్ణయించడం జరిగిందని డీఎం పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈ 9010374644 నంబర్ లో సంప్రదించాలన్నారు.