హైదరాబాద్ : సీఎం కేసీఆర్ను సోమవారం శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సీఎం అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. అలాగే నూతనంగా మరో అయిదువేల డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అదే విధంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంత భూములకు నీరందించడానికి జాకోరా, చందూరు ఎత్తిపోతలు, సిద్ధాపూర్ రిజర్వాయర్ మంజీర నదిపై చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినందుకు స్పీకర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం