నల్లగొండ: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పెద్దలు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి (Raghuveer Reddy) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఆయన పార్టీ సీనియర్ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తన పేరుతో రూ.32.04 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
అందులో ఆయన పేరున రూ.24,84,20,025 ఆస్తులు ఉండగా, తన భార్య పేరున రూ.7,20,03,724 ఆస్తులు ఉన్నట్లు చూపించారు. వివిధ బ్యాంకుల నుంచి రూ.17,41,50,500 అప్పుగా తీసుకున్నానని, భార్య పేరున రూ.25.29 లక్షలు అప్పులు ఉన్నట్లు తెలిపారు. కాగా, నల్లగొండ స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి నల్లగొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పోటీచేస్తున్నారు.