హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొద్దిమంది తమ వ్యాపారాలను యధేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు దృష్టిసారించారు. ఈక్రమంలో నగరంలోని మాసబ్ట్యాంక్లో ఉన్న ఓ స్నూకర్ పార్లర్పై ఆదివారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా పార్లర్ను నడుపుతున్నందుకుగాను యజమానిపై కేసు నమోదు చేశారు.
గతేడాది లాక్డౌన్ సందర్భంగా కూడా పార్లర్ నిర్వాహకులు ఇలానే వ్యవహరించారు. దీంతో పోలీసులు పార్లర్పై దాడిచేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి