హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) అధ్యక్షుడు సంజయ్కపూర్ (56) కరోనాతో మరణించారు. ఆయన 13 రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతున్నారని, శనివారం రాత్రి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారని హెచ్ఎంఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సంజయ్కపూర్ గొప్ప వ్యక్తి అని, ఆయన మరణం అసోసియేషన్కు తీరని లోటని పేర్కొన్నది. హెచ్ఎంఏ ఉపాధ్యక్షుడు కవిత రాజేశ్, సలహాదారులు నగేశ్ విశ్వనాథం, హరిశ్చంద్ర ప్రసాద్, శ్రవణ్ తదితరులు సంతాపం తెలిపారు.