కోల్కతా: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని, అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగాల్కు వచ్చాడని, అతను బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నాడని కూచ్బెహర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మమత ఆరోపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేరును ఆమె నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనను ఉద్దేశించే మమత ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తున్నది.
ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి తన విజయం కాయమని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తాను ఒక్కదాన్ని గెలిస్తే సరిపోదని, తనతోపాటు మరో 200 మంది తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించాలని మమత ఓటర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ తృణమూల్ అభ్యర్థులకు ఓటేసి వారిని గెలిపించాలని ఆమె కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్ !
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన
డొనాల్డ్ ట్రంప్లా మమత తీరు: బీజేపీ
కొవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై