మహబూబ్నగర్ : గ్రామాల్లో, పట్టణాల్లో పల్లె,పట్టణ ప్రగతి నిరంతరం కొనసాగాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్లో మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాల్లో పట్టణ, పల్లె ప్రగతిపై సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ..హరితహారంలో నాటిన మొక్కలతో రోడ్లకు ఇరువైలా చెట్లు స్వాగతం పలుకుతున్నట్లు ఉండాలన్నారు.
విద్యుత్ లైన్ లు, పోల్ షిఫ్టింగ్ వంటి పెండింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన పూర్తి సమాచారం, చేసిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులు గ్రామ పంచాయతీ దగ్గర బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే పనులకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలన్నారు.
గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా వందశాతం పనులు పూర్తి చేసిన గ్రామానికి అవార్డ్ అందిస్తామని పేర్కొన్నారు.
ప్రతి నెల గ్రామానికి, మున్సిపాలిటీ కి నిధులు అందిస్తున్నాం. సమస్యలకు పరిష్కారం వెంటనే చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, చిట్టెం రాం మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ లు స్వర్ణ, వనజ, కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి