RTC bus | హనుమకొండ (Hanamkonda) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది (RTC bus rammed into crop fields). ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ఓగులపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వరంగల్ 2 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి ఏటూరు నాగారం వెళుతోంది. ఈ క్రమంలో ఓగులపూర్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పెను ప్రమాదం తప్పడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read..
Mahua Moitra | మహువా 30 రోజుల్లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలి : పార్లమెంట్ హౌసింగ్ కమిటీ
Omar Abdullah | ఆ విడాకులకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరణ.. ఒమర్ అబ్దుల్లా పిటిషన్ కొట్టివేత
Virushka | కోహ్లీ దంపతుల ఆరో వివాహ వార్షికోత్సవ వేడుక.. సెలబ్రేషన్ ఫొటోలు వైరల్