హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న పార్టీ అధినేత ఎన్నిక కోసం నిర్వహించే ప్లీనరీ సమావేశం ఏర్పాట్లపై ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇంచార్జీ లకు సూచించారు.
అలాగే అధికారులు, పోలీసుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వారికి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రోజా రంగారావు, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
T20 World Cup | దుబాయ్లో కలిసిన ధోనీ, గేల్.. ఫొటో వైరల్
Nigeria Killings: నైజీరియాలో కాల్పులు, 43 మంది మృతి
Singur project | సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద