జనగామ : సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీస్ అధికారులకు సూచించారు. వరంగల్ సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి సారిగా ఆయన జనగాం పోలీస్ స్టేషన్ను సోమవారం సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్కు వచ్చే వారికి ఆహద్లకరంగా ఉండే విధంగా మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు.
అనంతరం రిసెప్షన్ కౌంటర్ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో అత్యధికంగా నమోదయ్యే కేసుల వివరాలను సీఐ మల్లేశ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణతో పాటు, సీపీ కెమెరాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై సీపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్, ఎస్.ఐలు శ్రీనివాస్, రవికుమార్ , ట్రైనీ ఎస్.ఐలు శ్రీనివాస్, సుమలత తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి