రంగారెడ్డి : వంద శాతం వాక్సినేషన్ జరిగేలా స్థానిక సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కోవిడ్ వాక్సినేషన్,ఒమిక్రాన్ వేరియంట్ పై జరుగుతున్న సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొవిడ్ మొదటి, రెండో వేవ్లో బాగా పని చేసిన వైద్య విభాగం వారికి, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖల వారికి అభినందనలు తెలిపారు.
అలాగే ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం, వైద్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించాలి. కొవిడ్ ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. తక్కువ వ్యాక్సినేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక డ్రైడ్లు చేపట్టి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసేలా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి జాగృత పర్చాలని మంత్రి సూచించారు.
సమావేశానికి మూసి రివర్ బోర్డు చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య , అంజయ్య యాదవ్, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, డిసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగ రెడ్డి, జడ్పీ సిఈఓ, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీడీవో లు, తహసీల్దార్ లు, మునిసిపల్ మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు