వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు రావడం తెలంగాణ వారందరికి గర్వకారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మన రామప్పకు ఈ ఘనకీర్తి దక్కడం సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని ఆయన తెలిపారు. చారిత్రిక వారసత్వ కట్టడమై రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. వారసత్వ గుర్తింపు లభించడంతో రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహం తోనే ఇది సాధ్యమైందని మంత్రి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో యూనెస్కో గుర్తింపునకు ప్రయత్నించినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రామప్ప ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని, దేశ, విదేశీ పర్యాటకులు రామప్పకు బారులు తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ద్వారా రామప్ప పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. పర్యాటకం పెరిగితే స్థానికులకూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరకుతాయన్నారు.
యునెస్కో అడిగిందే తడవుగా..రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రత్యేకతలను పలుమార్లు తెలియజేస్తూ నిపుణులతో నివేదికలను పంపించిందన్నారు. జూన్ 23న సహచర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ , వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులుఢీల్లీ వెళ్లాం. నాటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి వారసత్వ గుర్తింపు కోసం కేంద్ర నుంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : రెండంతస్తుల భవనం పైనుంచి పడి బాలుడు మృతి
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు