హైదరాబాద్ : విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 3.6 – 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కేరళ తీరం నుంచి ఉత్తర కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ర్టంలో ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ర్టంలో పలుచోట్ల వాతావరణం చల్లబడిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..